ఐసీయూలో ఏడు రోజులు శవం.. రోజుకు లక్ష వసూల్ చేసిన హాస్పిటల్..

by Sujitha Rachapalli |

పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌ షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ నెలకొంది. మరణించిన రోగిని ఐసీయూలో ఏడు రోజుల పాటు ఉంచిన హాస్పిటల్ యాజమాన్యం.. రోజుకు లక్ష రూపాయలు వసూలు చేసింది.

ఐసీయూలో ఏడు రోజులు శవం.. రోజుకు లక్ష వసూల్ చేసిన హాస్పిటల్..
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌ షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ నెలకొంది. మరణించిన రోగిని ఐసీయూలో ఏడు రోజుల పాటు ఉంచిన హాస్పిటల్ యాజమాన్యం.. రోజుకు లక్ష రూపాయలు వసూలు చేసింది. కాగా ఈ ఆరోపణలు నేషనల్ అసెంబ్లీ సబ్‌కమిటీ ఆన్ హెల్త్ సమావేశంలో బయటపడ్డాయి. కమిటీ సభ్యురాలు షైస్తా ఖాన్ రోగి PIMSలో మరణించిన తర్వాత షిఫాలో ఉంచబడ్డారని చెప్పారు. ప్రైవేట్ హెల్త్‌కేర్‌లో నీతి,పర్యవేక్షణపై ఆందోళనలను లేవనెత్తింది. హాస్పిటల్ ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా తోసిపుచ్చింది. కానీ ఈ విషయంపై సోషల్ మీడియాలోనూ వ్యతిరేకత ఎదురైంది.

Next Story