ఘోరం.. ప్రియుడి ముందే మహిళపై 12 మంది సామూహిక అత్యాచారం

by Disha Web Desk 6 |
ఘోరం.. ప్రియుడి ముందే మహిళపై 12 మంది సామూహిక అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత సమాజంలో మహిళలపై దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు అడ్డూ అదుపు లేకుండా కొంతమంది వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకువచ్చినా కొంత మంది మార్పు రావడం లేదు. మరీ దారుణంగా వావి వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. అత్యాచారాల సంఘటనలు నిత్యం ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, జార్ఖండ్‌లో ఓ 28 ఏళ్ల మహిళపై 12 మంది సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది.

వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లో పాకుర్ జిల్లాలో ఓ 28 ఏళ్ల మహిళ తన ప్రియుడితో బయటకు వెళ్లింది. రాత్రి పూట సరదాగా తిరుగుతుండగా గుర్తు తెలియని దుండగులు వారిపై దాడి చేశారు. ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి 12 మంది పశువుల్లా అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story

Most Viewed