హలో ఫ్రెండ్స్.. హెలికాప్టర్‌లో ఆరెంజ్ పార్టీ.. తేజస్వీ యాదవ్ మరో వివాదం

by Disha Web Desk 14 |
హలో ఫ్రెండ్స్.. హెలికాప్టర్‌లో ఆరెంజ్ పార్టీ.. తేజస్వీ యాదవ్ మరో వివాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వి యాదవ్ ట్వీట్‌లు ఈ మధ్య వివాదంగా మారుతున్నాయి. ఇటీవల ‘ఫిష్ పార్టీ’ అని వివాదం తర్వాత తాజాగా మరోవైపు వీడియో ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. హెలికాప్టర్‌లో వికాశీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ ముఖేష్ సాహ్నితో కలిసి ‘ఫిష్ పార్టీ’ చేసుకున్నానని వీడియో పోస్ట్ చేశారు. నవరాత్రుల వేళ మాంసాహార భోజనమా? అంటూ బీజేపీ ఐటీ సెల్, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా ‘హాలో ఫ్రెండ్స్ హెలికాప్టర్‌లో ఆరెంజ్ పార్టీ.. ఈ ఆరెంజ్ రంగుపై చికాకుపడరు కదా?’ అని బీజేపీకి పరోక్షంగా ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు నేతలు బత్తాయి పండ్లను తింటున్నారు. దీంతో వీడియో వైరల్ అయ్యింది. బీజేపీ సపోర్టర్లు తేజస్వీ యాదవ్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

Next Story

Most Viewed