Heeraben Modi మృతి: ముగిసిన అంత్యక్రియలు

by Disha Web Desk 4 |
Heeraben Modi మృతి: ముగిసిన అంత్యక్రియలు
X

దిశ, వెబ్ డెస్క్: గాంధీ నగర్ సెక్టార్ 30 స్మశానవాటికలో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్(100) అంత్యక్రియలు ముగిశాయి. ప్రధాని మోడీ తల్లి చితికి నిప్పంటించారు. మోడీ అంత్యక్రియలకు అన్ని తానై వ్యవహరించారు. అంతకుముందు మోడీ తల్లి పాడె మోశారు. రేసన్‌లోని తల్లి నివాసంలో మృతదేహానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కాగా హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో రెండు రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. కాగా హీరాబెన్ అంత్యక్రియల్లో సోమాభాయ్ మోడీ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Also Read...

హీరాబెన్ మోడీ నేపథ్యమిదే..

Next Story

Most Viewed