భారత జట్టు కెప్టెన్ అంటూ.. CMకు షాక్ ఇచ్చిన కేటుగాడు

by Disha Web Desk 4 |
భారత జట్టు కెప్టెన్ అంటూ.. CMకు షాక్ ఇచ్చిన కేటుగాడు
X

దిశ, వెబ్‌డెస్క్: మోసం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఇలాంటి ఓ మోసమే తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తనను తాను ఏకంగా వీల్ ఛైర్ క్రికెట్ ప్రపంచ కప్ సాధించిన టీంకు కెప్టెన్ అని చెబుతూ ఏకంగా సీఎంకే షాక్ ఇచ్చాడు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా కడలాడి తాలుకాకు చెందిన దివ్యాంగుడు వినోద్ బాబు తనకు తాను భారత వీల్ ఛైర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ అని చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. 2022లో తమ జట్టు ఆసియా కప్ గెలిచిందని తమిళనాడు మంత్రులను కలిశాడు.

అయితే గతవారం లండన్‌లో జరిగిన టీ-20 ప్రపంచ కప్ గెలిచామని ఓ కప్‌తో సీఎం స్టాలిన్‌ను కలిశాడు. అయితే సచివాలయానికి వినోద్ బాబు మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందగా ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఎంక్వైరీ చేసింది. వినోద్ బాబు అసలు జట్టులో లేరని తేలింది. ఇలానే చెబుతూ ఓ బేకరీ ఓనర్ వద్ద వినోద్ బాబు రూ.లక్ష దండుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు మినిస్టర్స్ సైతం ఆయనకు ఆర్థిక సాయం చేసినట్లు తెలిసింది. వినోద్ కుమార్ మోసాలపై ఫిర్యాదు అందగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏకంగా సీఎంనే బురడీ కొట్టించిన ఈ మాయగాడి అంశం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.


Next Story

Most Viewed