కారులో నిద్రిస్తున్న వ్యాపారిని బయటికి ఈడ్చి మరీ మర్డర్

by Dishanational4 |
కారులో నిద్రిస్తున్న వ్యాపారిని బయటికి ఈడ్చి మరీ మర్డర్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆదివారం ఉదయం ఘోరమైన మర్డర్ జరిగింది. ఓ వ్యాపారి ధాబాలోని పార్కింగ్ స్థలంలో తన కారులో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని బయటకు ఈడ్చి పడేసి తుపాకీతో కాల్చి చంపారు. హర్యానాలోని ముర్తల్‌లో ఉన్న గుల్షన్ ధాబా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని గోహనా పట్టణం శివార్లలోని సరగ్తాల్ గ్రామానికి చెందిన 38 ఏళ్ల సుందర్ మాలిక్‌గా గుర్తించారు. అతడు మద్యం వ్యాపారం చేస్తుండేవాడని వెల్లడైంది. సుందర్ మాలిక్‌‌పై దాదాపు 35 రౌండ్ల కాల్పులు జరిగాయి. పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. విచారణలో భాగంగా మృతుడికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా ? గతంలో ఎవరైనా అతడిపై దాడి చేశారా ? అనే అంశాలను సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గ్యాంగ్ వార్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed