దేశ నలుమూలల్లో 5జీ.. ఆ ప్రాంతాలపై ఫోకస్..: కేంద్ర మంత్రి

by Dishafeatures2 |
దేశ నలుమూలల్లో 5జీ.. ఆ ప్రాంతాలపై ఫోకస్..: కేంద్ర మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: 5జీ నెట్వర్క్‌ను దేశ నలుమూలలా అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, దాన్ని పూర్తి చేసే విధంగా కార్యాచరణ కూడా ప్రారంభించామని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. అంతేకాకుండా దేశమంతా 5జీ నెట్వర్క్ అందించేందుకు ఆఖరు తేదీని కూడా ఫిక్స్ చేసుకున్నామని, మరో రెండు మూడు నెలల్లో దేశంలోని ప్రతి ప్రదేశంలో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 5జీ సేవలు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.

'ప్రస్తుతం టెలికాం ఇండస్ట్రీ పట్టణాలతో పాటు పల్లె ప్రాంతాలపై కూడా ఫోకస్ పెడుతోంది. అక్టోబర్ 12 నాటికి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది' అని ఆయన తెలిపారు. దాంతో పాటుగా 5జీ సేవల్లో ఎటువంటి అంతరాయాలు లేకుండా, ప్రతి ప్రదేశంలో ఒకే తరహా సేవలు అందేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ప్రతి ఒక్కరికీ 5జీ సేవలు అందుతాయని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి : తెలుగు రాష్ట్రాల్లో 5జీ సేవలు.. త్వరలో అక్కడ ఒక్క చోటే..



Next Story

Most Viewed