అలా చేయకపోతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని అమలు చేయలేదు: సిపిఐ ప్రధాన కార్యదర్శి

by Malleboina Mahesh |

భారత దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అయితే మూడు ప్రధాన అంశాలపై మాత్రం సుప్రీం స్టే ఇచ్చింది.

అలా చేయకపోతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని అమలు చేయలేదు: సిపిఐ ప్రధాన కార్యదర్శి
X

దిశ, వెబ్ డెస్క్: భారత దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ చట్టం (Waqf Amendment Act) అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు (Supreme Court) నిరాకరించింది. అయితే మూడు ప్రధాన అంశాలపై మాత్రం సుప్రీం స్టే ఇచ్చింది. వక్ఫ్ సవరణ చట్టంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా (CPI General Secretary D Raja) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "మా పార్టీ తరపున, వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తున్న పిటిషనర్లలో నేను ఒకడిని. సుప్రీంకోర్టు పరిష్కరించాల్సిన అనేక సంబంధిత అంశాలను లేవనెత్తింది. ఆ సమస్యలను పరిష్కరించి, పరిష్కారం కనుగొనకపోతే, చట్టాన్ని ఎలా అమలు సాధ్యం కాదు. ఒక విధంగా కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించకపోతే వక్ఫ్ సవరణ చట్టం నిలిచిపోతుంది. ఇప్పుడు, ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలను పార్లమెంట్ పరిష్కరించాలి. ఎస్సీ లేవనెత్తిన సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకు రాలేదు అని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా చెప్పుకొచ్చారు.

Next Story