Saif Ali Khan: రిస్క్ లో సైఫ్ అలీఖాన్ రూ.15వేల కోట్ల ప్రాపర్టీ..!

by Shamantha N |
Saif Ali Khan: రిస్క్ లో సైఫ్ అలీఖాన్ రూ.15వేల కోట్ల ప్రాపర్టీ..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ప‌టౌడీ కుటుంబానికి చెందిన సుమారు రూ. 15 వేల కోట్ల ప్రాప‌ర్టీ(Pataudi Family Property)ని స్వాధీనం చేసుకునేందుకు ప్ర‌భుత్వం రెఢీ అవుతోంది. ఇటీవ‌లే మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆ ఆస్తుల‌పై కీల‌క తీర్పు వెలువ‌రించింది. ప‌టౌడీ ఆస్తుల‌పై 2015లో విధించిన స్టేను ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో 1968 నాటి ఎనిమీ ప్రాపర్టీ యాక్టు ప్ర‌కారం ప‌టౌడీ కుటుంబ ఆస్తుల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే, ప‌టౌడీ వంశ‌నికి చెందిన బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్‌కు ఆ ప్రాప‌ర్టీతో లింకు ఉన్న‌ది. సైఫ్ పూర్వీకుల‌కు చెందిన ఆస్తుల్లో.. ఫ్లాగ్ స్టాఫ్ హౌజ్ ఉన్న‌ది. ఇక్క‌డే సైఫ్ త‌న బాల్యాన్ని గ‌డిపాడు. నూర్ ఉస్ సాహెబ్ ప్యాలెస్‌, దార్ ఉస్ స‌లామ్‌, బంగ్లా ఆఫ్ హ‌బిబ్‌, అహ్మ‌దాబాద్ ప్యాలెస్‌, ఖోఫిజా ప్రాప‌ర్టీలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు జ‌స్టిస్ వివేక్ అగ‌ర్వాల్ ఈ కేసులో తీర్పును ఇస్తూ.. ఎనిమీ ప్రాప‌ర్టీ యాక్టు ప్రకారం సంబంధిత వ్య‌క్తులు 30 రోజుల్లోగా పిటీష‌న్లు దాఖ‌లు చేసుకోవ‌చ్చు అని తెలిపారు.

అసలు కేసు ఏంటంటే?

దేశ విభ‌జ‌న త‌ర్వాత పాకిస్థాన్‌కు వ‌ల‌స వెళ్లిన వారి స్థిర ఆస్తుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఎనిమీ ప్రాప‌ర్టీ యాక్టు ప్ర‌కారం స్వాధీనం చేసుకుంటుంది. అయితే, భూపాల్‌కు చెందిన చివ‌రి న‌వాబు హ‌మీదుల్లా ఖాన్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయ‌న పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ 1950లో పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. రెండ‌వ కుమార్తె సాజిదా సుల్తాన్ భారత్ లోనే ఉందిపోయారు. న‌వాబ్ ఇఫ్తిక‌ర్ అలీఖాన్ ప‌టౌడీని ఆమె పెళ్లి చేసుకున్న‌ది. దీంతో ప‌టౌడీ ఆస్తుల‌కు ఆమె చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సురాల‌య్యారు. సాజిదా సుల్తాన్ మ‌నువ‌డే సైఫ్ అలీ. దీంతో, ప‌టౌడీ ప్రాప‌ర్టీల్లో కొంత షేర్ ఇప్పుడు సైఫ్‌కు వ‌స్తుంది. అయితే అబితా సుల్తాన్ వ‌ల‌స వెళ్ల‌డం వ‌ల్ల‌.. ఆ ప్రాప‌ర్టీని ఎనిమీ ప్రాపర్టీగా భావిస్తూ.. దాన్ని ప్ర‌భుత్వం జ‌ప్తు చేసేందుకు రెడీ అవుతోంది. 2019లో సాజిదా సుల్తాన్‌ను చ‌ట్ట‌ప‌ర‌మైన వారసురాలిగా గుర్తించినా.. ప్రస్తుత తీర్పుతో ఫ్యామిలీ ప్రాపర్టీ వివాదం మళ్లీ మొదటికే వచ్చింది. ఇకపోతే, ప్రభుత్వ నిర్ణయంతో పటౌడీ ప్రాపర్టీల్లో ఉంటున్న లక్షన్నరమంది నివాసితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆ భూములు లాగేసుకుంటుందని అనుమనిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed