దేశంలోని రైతులకు కేంద్రం శుభవార్త.. ఫర్టిలైజర్ సబ్సిడీకి కేబినెట్ ఆమోదం

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-28 07:35:06  IST  )

దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం (Government of India) పండుగల లాంటి వార్త చెప్పింది.

దేశంలోని రైతులకు కేంద్రం శుభవార్త.. ఫర్టిలైజర్ సబ్సిడీకి కేబినెట్ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం (Government of India) పండుగ లాంటి వార్త చెప్పింది. ఈ మేరకు ఇవాళ ప్రధాన నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఫర్టిలైజర్ సబ్సిడీ రూ.3 వేల కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్నదాతలకు ఎరువులను సరసమైన ధరలకు కొనుగోలు చేయగలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ ఎరువుల మార్కెట్‌లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ధరలను సమతుల్యం చేయడం, DAP వంటి ఎరువుల రిటైల్ ధరను కాపాడటం ఈ ఫర్టిలైజర్ సబ్సిడీ ప్రధాన లక్ష్యమని సమాచారం. ముఖ్యంగా ఈ సబ్సిడీతో రైతులకు ఎరువులు నిరంతరం అందుబాటులో ఉండటం, ఆహార భద్రత, వ్యవసాయ వృద్ధి మద్దతుకు ఊతం ఇవ్వనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంలో దేశంలోని 14.6 కోట్ల మంది అన్నదాతలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది.

Next Story