పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం తీపికబురు: రూ.5 లక్షల వరకు ‘ఆటో క్లెయిమ్’

by Kema Shiva Kumar |

ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నది.

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం తీపికబురు: రూ.5 లక్షల వరకు ‘ఆటో క్లెయిమ్’
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని కోట్ల మంది ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల వరకు ఉండే పీఎఫ్ క్లెయిమ్‌లను ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ (Auto Claim Settlement) పద్ధతి ద్వారా ఆటోమేటిక్‌గా ఆమోదించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అందుకు సంబంధించిన ఈపీఎఫ్‌వో కొత్త డిపాజిట్ వ్యవస్థ నేటి నుంచే అధికారికంగా ప్రారంభమైంది.

ఒకే డేటాబేస్.. మరింత వేగంగా పీఎఫ్ సేవలు

అయితే, కొత్తగా చేపట్టిన టెక్నికల్ మార్పుల వల్ల ఇక నుంచి పీఎఫ్ సేవలు శరవేగంగా సాగనున్నాయి. ఇది వరకు క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు వారాల తరబడి వేచి చూడాల్సి రాగా.. ఇకపై రోజుల్లోనే పని పూర్తి కానుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులందరి పీఎఫ్ వివరాలను ఒకే కేంద్రీకృత డేటాబేస్ (Centralized Database) పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో ఉద్యోగులు దేశంలో ఎక్కడి నుంచైనా తమ పీఎఫ్ వివరాలను ఒకే చోట సులభంగా చూసుకోవచ్చు. జూలై 15 నాటికి ఖాతాల్లో జమ అయిన మొత్తానికి ప్రభుత్వం అందించే పీఎఫ్ వడ్డీ (PF Interest) జమ చేసే ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.

Next Story