50 ఏళ్లపాటు వ‌డ్డీ లేకుండా లోన్స్.. లక్ష కోట్లతో ఫండ్

by Dishanational4 |
50 ఏళ్లపాటు వ‌డ్డీ లేకుండా లోన్స్.. లక్ష కోట్లతో ఫండ్
X

దిశ, నేషనల్ బ్యూరో : టెకీ యువ‌త‌కు విరివిగా రుణాలను ఇచ్చేందుకు దాదాపు ల‌క్ష కోట్ల‌ రూపాయలతో కార్ప‌స్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్లడించారు. 50 ఏళ్ల పాటు వ‌డ్డీ లేకుండా ఆ రుణాలను ఇవ్వ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. దీర్ఘకాలిక ఫైనాన్సింగ్‌, రీ ఫైనాన్సింగ్ లో భాగంగా ఈ స్కీమ్‌ను అమలు చేయనున్నట్లు తెలిపారు. యువతకు నామమాత్ర వడ్డీ లేదా వడ్డీ పూర్తిగా లేకుండా దీర్ఘకాలిక లోన్లను ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థను సంఘటితం చేయడానికి డిజిటల్‌ ఇండియా చాలా కీలకమన్నారు.

Next Story

Most Viewed