దేశ రక్షణకే అధిక ప్రాధాన్యం ఇవ్వండి.. Amit Shah..

by Dishafeatures2 |
దేశ రక్షణకే అధిక ప్రాధాన్యం ఇవ్వండి.. Amit Shah..
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు 2022 నిర్వహించబడింది. ఈ సదస్సులో భాగంగా దేశ రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అమిత్ షా తెలిపారు. దేశ రక్షణను బలోపేతం చేసేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాలను ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా అంతర్గత భద్రత విషయంలో ప్రభుత్వం 'మూడు శాశ్వత సమస్యలను' కలిగి ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. రెండు రోజులు జరిగిన ఈ సదస్సులో దేశంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లపై తీవ్ర చర్చలు జరిగాయి. అంతేకాకుండా 2014 నుంచి మోదీ ప్రభుత్వం దేశ జీడీపీ అభివృద్ధి కోసం అనేక కసరత్తులు చేస్తోందని, చేసిన విశ్లేషణ ప్రకారం ఎన్నో సమస్యలకు ప్రభుత్వం విజవంతంగా పరిష్కారాలు కనుగొంటుందని ఆయన తెలిపారు.


'అక్కడ ఏం చేయాలన్నా మోడీ పర్మిషన్ ఉండాల్సిందే': సుబ్రమణ్యస్వామి


Next Story

Most Viewed