తొమ్మిదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ఆపై చెట్ల పొదల్లోనే..

by Disha Web Desk 9 |
తొమ్మిదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ఆపై చెట్ల పొదల్లోనే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటి నుంచి ఆడపిల్ల బయటకు వెళ్తే మళ్లీ తిరిగి వచ్చే వరకు నమ్మకం ఉండటం లేదు. చిన్న, పెద్ద తేడా లేకుండా కామాంధులు తెగపడి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. అడ్డొచ్చినా.. అంగీకరించకపోయినా హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థినిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడో కామాంధుడు. తమిళనాడులో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఊటీ బైక్రా ప్రాంతానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 9వ, తరగతి చదువుతుంది. ఆమె రోజు స్కూల్‌కు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంది. ఇదే మాదిరిగా సోమవారం ఉదయం స్కూలుకు వెళ్లిన బాలిక తిరిగి మళ్లీ రాలేదు. అయితే సమయం దాటిపోయినా కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలతోపాటు సమీప ప్రాంతాలు, ఫ్రెండ్స్ వద్ద వాకాబు చేశారు. అయినా విద్యార్థిని ఆచూకీ లభించలేదు. ఇదే సమయంలో ఆంకార్ బోర్డు ప్రాంతంలోని చెట్ల పొదల్లో ఆ బాలిక మృతదేహం ఇరుగుపొరుగు వారి కంటపడటంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని, బాలికపై హత్యాచారం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. మృతదేహం ఉన్న చోట ఓ కారు పార్కు చేసి ఉండడంతో పోలీసులు అనుమానంతో ఆ కారు వివరాలు కనుక్కొగా.. కక్కకోడమందు ప్రాంతానికి చెందిన రాజేష్ కుట్టన్‌ అనే వ్యక్తికి సంబంధించనదిగా తెలిసింది. అతడే బాలికను కారులో కిడ్నాప్ చేసి.. అనంతరం స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడి.. తర్వాత ఆమెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించడానికి సన్నద్ధం కాగా, హతురాలి కుటుంబీకులు, బంధువులు అడ్డుకున్నారు. ‘నా కుమార్తెను హత్య చేసినవాడిని అరెస్టు చేశాకే మృతదేహాన్ని పోస్టుమార్టాటానికి తరలించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉన్నతాధికారులు కలగజేసుకుని నిందితుడిని అతి త్వరలోనే పట్టుకుని, శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. కాగా, అనుమానితుడు రాజేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది.



Next Story

Most Viewed