Delhi: మేజర్‌ సినిమాపై మాజీ రాష్ట్రపతి ప్రశంసలు

by Disha Web Desk 16 |
Delhi: మేజర్‌ సినిమాపై మాజీ రాష్ట్రపతి ప్రశంసలు
X
  • రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన హీరో అడవి శేష్
  • నెట్టింట ఫోటోలు వైరల్

దిశ, డైనమిక్ బ్యూరో: అడివిశేష్ హీరోగా తెరకెక్కిన మేజర్ మూవీ భారీ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబై బాంబు దాడుల్లో అమ‌ర వీరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇక ఈ సినిమా గత ఏడాది జూన్ 3వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజుల తరువాత కూడా ఈ సినిమా ప్రశంసలు అందుకుంటుంది.

తాజాగా మేజర్ సినిమాను మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవిద్ కూడా వీక్షించారు. ఈ నేపథ్యంలో అడివి శేష్‌ను సైతం పిలిపించి ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి సినిమాను తీసినందుకు గాను అడివి శేష్‌ను చిత్రయూనిట్‌ను ప్రశంసించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: Ponniyin Selvan : 'పొన్నియిన్ సెల్వన్' నిర్మాతలపై ఈడీ దాడులు

Next Story