ఢిల్లీ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేశారో సీఎం కేజ్రీవాల్ చెప్పాలి.. బీజేపీ ఎంపీ గంభీర్

by Dishafeatures2 |
ఢిల్లీ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేశారో సీఎం కేజ్రీవాల్  చెప్పాలి.. బీజేపీ ఎంపీ గంభీర్
X

దిశ, వెబ్ డెస్క్: ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ఢిల్లీ అభివృద్ధి కోసం ఆప్ ప్రభుత్వం గడిచిన తొమ్మిదేళ్లలో ఎంత ఖర్చుపెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే టీవీలు, పేపర్లలో ప్రకటనల కోసం కూడా ఎంత ఖర్చుపెట్టారో చెప్పాలని అన్నారు. వరదల్లో నష్టపోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా సాయం చేయాలని, వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. దేశంలోని అన్ని విపక్షాలు ఏకమైనా బీజేపీని ఏం చేయలేవని అన్నారు. బీజేపీ ఎవరికీ భయపడబోదని స్పష్టం చేశారు. దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలనేది త్వరలోనే ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. కాగా ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ దేశంలో మరోసారి అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.



Next Story