ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం

by Muthe.Rajitha |   (  Updated:2025-08-17 15:37:19  IST  )

ఒడిశా మాజీ సీఎం, బిజు జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఆదివారం ఆసుపత్రి పాలయ్యారు.

ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : ఒడిశా మాజీ సీఎం, బిజు జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఆదివారం ఆసుపత్రి పాలయ్యారు. శనివారం తీవ్ర అసౌకర్యానికి గురవ్వగా.. కుటుంబ సభ్యులు హుటాహుటిన భువనేశ్వర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నవీన్ పట్నాయక్ తీవ్ర డీహైడ్రేషన్ కు గురయ్యారని తెలియజేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయనకు పూర్తిగా రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. కాగా ఇటీవల ముంబైలో అర్థటైటిస్ కు సంబంధించిన చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.

Next Story