- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫుడ్ పాయిజనింగ్: 36 మంది విద్యార్థులకు అస్వస్థత
మహారాష్ట్ర సాంగ్లీలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది..

X
దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్ర సాంగ్లీలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో మధ్యాహ్న భోజనం చేసిన 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం అనంతరం విద్యార్థులంతా కడుపునొప్పి, వికారంగా ఉందంటూ విద్యార్థులంతా పాఠశాల సిబ్బందికి తెలియజేశారు. వెంటనే అప్రమత్తమై సిబ్బంది పిల్లలను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆహారానికి పరీక్షలు నిర్వహించారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






