కోర్టు ఆవరణలో కాల్పులు.. మహిళ కడుపులోకి దూసుకెళ్లిన బుల్లెట్

by Disha Web Desk 2 |
కోర్టు ఆవరణలో కాల్పులు.. మహిళ కడుపులోకి దూసుకెళ్లిన బుల్లెట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం సాకేత్ కోర్టు ప్రాంగణంలోని లాయర్స్ బ్లాక్‌లో గుర్తు తెలియని ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. లాయర్ దుస్తుల్లో వచ్చి విచక్షణారహితంగా ఫైరింగ్ చేశాడు. ఓ మహిళే టార్గెట్‌గా నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియక బ్లాక్‌లోని లాయర్లు పరుగులు తీశారు. ఈ కాల్పుల్లో మహిళ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆమెను స్థానికంగా ఉన్నవారు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళ భర్తే కాల్పులు జరిపి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనికి కుటుంబ తగాదాలు కారణం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story