శ్రీనగర్ లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

by Disha Web Desk 1 |
శ్రీనగర్ లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీనగర్‌లోని హజ్రత్బాల్ ప్రాంతంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం మూడు వాణిజ్య భవనాలు, ఆరు ఇళ్లు దెబ్బతిన్నాయి. హజ్రత్బాల్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఓ హోటల్ వంట గదిలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో ఆ మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. మొత్తం 16 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పేందుకు యత్నించాయి.

మొత్తం తొమ్మిది భవనాలు దగ్ధమవగా.. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. స్థానికులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. సాయంత్రం వరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతూనే ఉన్నా.. మంటలు మాత్రం పూర్తిగా అదుపులోకి రాలేదు. సహాయక చర్యలను స్థానిక ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు.



Next Story