Encounter: కశ్మీర్‌లో భీకర పోరు

by Vemula.Srinu Prasad |

భారత్, పాకిస్థాన్ సరిహద్దులో భీకర పోరు జరుగుతోంది..

Encounter: కశ్మీర్‌లో భీకర పోరు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్(Bharath), పాకిస్థాన్(Pakistan) సరిహద్దులో భీకర పోరు జరుగుతోంది. మన బోర్డర్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు(Terrorists) దుష్ట ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఉగ్రమూకలకు భారత్ భద్రతా దళాలు దీటుగా జవాబిస్తున్నారు. బోర్డర్‌లోకి వస్తే ఏరిపారేస్తామని హెచ్చరించినా ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు తెగబడుతున్నారు. దీంతో మన జవాన్లు తుపాకులు పని చెబుతున్నారు.

ఈ రోజు ఉదయం నుంచే జమ్ముకశ్మీర్‌లోని బందిపోరా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మొన్న 26 మంది పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. కులనార్, బాజీపూర్‌ ప్రాంతాల్లోకి చొరబడ్డారు. దీంతో భారత్ జవాన్లు ఎన్ కౌంటర్‌(Encounter)కు దిగారు. రెండు ప్రాంతాలను భారీగా మోహరించారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది. దీంతో జమ్ము కశ్మీర్‌లో టెన్షన్ వాతావరణ కొనసాగుతోంది. దీంతో సరిహద్దుల్లో అలజడి చెలరేగింది.

Next Story