- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విరిగిపడ్డ రంగుల రాట్నం.. సూరజ్కుండ్ మేళాలో ఘోర ప్రమాదం.. పోలీస్ దుర్మరణం, 13 మందికి గాయాలు
హర్యానాలోని ఫరీదాబాద్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సూరజ్కుండ్ మేళాలో విషాదం నెలకొంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానాలోని ఫరీదాబాద్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సూరజ్కుండ్ మేళాలో విషాదం నెలకొంది. మేళాలో సందర్శకుల వినోదం కోసం ఏర్పాటు చేసిన ఒక జాయ్రైడ్ (రంగుల రాట్నం వంటిది) ఒక్కసారిగా కూలిపోవడంతో ఒక పోలీసు ఇన్స్పెక్టర్ ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. శనివారం సాయంత్రం సుమారు 6:15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. జాయ్రైడ్ ఒక్కసారిగా పక్కకు వరిగిపోవడం గమనించిన అక్కడి విధుల్లో ఉన్న ఒక పోలీసు ఇన్స్పెక్టర్, అందులోని వారిని కాపాడేందుకు తక్షణమే స్పందించారు. ప్రజలను సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా, జాయ్రైడ్కు సంబంధించిన ఒక భారీ భాగం ఆయన ముఖానికి, తలకు బలంగా తగిలింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తరలించే లోపే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
క్షతగాత్రుల పరిస్థితి...
ఈ ప్రమాదంలో గాయపడిన మరో 13 మందిని అంబులెన్స్ల ద్వారా వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారందరికీ చికిత్స అందుతోందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫరీదాబాద్ జిల్లా కలెక్టర్ (DC) ఆయుష్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. జాయ్రైడ్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. విధుల్లో ఉండి ప్రజలను కాపాడే ప్రయత్నంలో ఇన్స్పెక్టర్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాం. జాయ్రైడ్ ఆపరేటర్పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల సాంకేతిక కారణాలను అన్వేషిస్తున్నారు.






