- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > వృద్ధురాలిని రోడ్డుపక్కన పడేసిన కుటుంబం.. మరుసటి రోజే మరణం.. కన్నీళ్లు తెప్పిస్తున్న సీసీటీవీ రికార్డు
వృద్ధురాలిని రోడ్డుపక్కన పడేసిన కుటుంబం.. మరుసటి రోజే మరణం.. కన్నీళ్లు తెప్పిస్తున్న సీసీటీవీ రికార్డు
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మాట్లాడలేని, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని.. కుటుంబ సభ్యులు రాత్రి వీధిలో వదిలి వెళ్లిపోయారు. కిషున్ దాస్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. క్యాన్సర్తో బాధపడుతూ,

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మాట్లాడలేని, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని.. కుటుంబ సభ్యులు రాత్రి వీధిలో వదిలి వెళ్లిపోయారు. కిషున్ దాస్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. క్యాన్సర్తో బాధపడుతూ, మెడపై తీవ్రమైన గాయంతో ఉన్న ఆమెను.. ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఈ-రిక్షాలో వచ్చి రోడ్డు పక్కన వదిలివేసి వెళ్లిపోయారు. ఇది సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయింది. మరుసటి రోజు ఉదయం ఆమె క్లిష్ట పరిస్థితిలో కనిపించింది. దీంతో దర్శన్ నగర్ మెడికల్ కాలేజీకి చికిత్స కోసం తరలించబడింది. అదే రోజు రాత్రి మరణించింది. పోలీసులు ఈ ఘటనను విచారిస్తున్నారు. కానీ చీకటి, దూరం కారణంగా వ్యక్తులను, ఈ-రిక్షాను గుర్తించడం కష్టంగా ఉంది.
Next Story






