కొడుకుపై రేప్ కేసు.. భరించలేక తల్లిదండ్రుల ఆత్మహత్య.. కానీ కేసులో ట్విస్ట్ ఇదే..

by Sujitha Rachapalli |

కోల్‌కతాలో దారుణం చోటు చేసుకుంది. 26 ఏళ్ల జయంత దాస్ అనే వ్యక్తి వివాహం చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా వాడుకున్నాడనే మహిళ ఆరోపణలతో అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఈ విషయాన్ని భరించలేకపోయిన అతని తల్లిదండ్రులు

కొడుకుపై రేప్ కేసు.. భరించలేక తల్లిదండ్రుల ఆత్మహత్య.. కానీ కేసులో ట్విస్ట్ ఇదే..
X

దిశ, వెబ్ డెస్క్ : కోల్‌కతాలో దారుణం చోటు చేసుకుంది. 26 ఏళ్ల జయంత దాస్ అనే వ్యక్తి వివాహం చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా వాడుకున్నాడనే మహిళ ఆరోపణలతో అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఈ విషయాన్ని భరించలేకపోయిన అతని తల్లిదండ్రులు జగన్నాథ్ దాస్ (48), మోనికా దాస్ (42) బిరాటి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసు సోషల్ మీడియాలో చర్చను రేకెత్తించింది. ఫాల్స్ రేప్ కేసు కారణంగా కుటుంబం మొత్తం నాశనమైపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి.

జయంత దాస్‌ను జూలై 15న మణికటల పోలీసులు అరెస్టు చేశారు. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి ఒక మహిళపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు రాగా.. అతను పరారీ కావడానికి ప్రయత్నించినప్పటికీ పట్టుబడ్డాడు. అయితే అరెస్టు జరిగిన కొన్ని గంటల తర్వాత.. జూలై 16న జగన్నాథ్, మోనికా దాస్‌ల మృతదేహాలు రైల్వే ట్రాక్‌ల సమీపంలో కనిపించాయి. వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బరాసత్ రైల్వే పోలీసులు రెండు అసహజ మరణ కేసులను నమోదు చేశారు. ఈ కేసు ప్రజల ఆగ్రహాన్ని హైలైట్ చేసింది. ఈ కేసును అత్యాచార చట్టాల దుర్వినియోగంగా అభివర్ణించారు. ఈ ఆరోపణలు అవమానానికి దారితీసి తల్లిదండ్రులను ఆత్మహత్యకు ప్రేరేపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story