యువతి పెళ్లి జరుగుతుండగా మాజీ ప్రియుడి ఎంట్రీ.. మండపం పైకి ఎక్కి ఏం చేశాడంటే?

by Disha Web Desk 9 |
యువతి పెళ్లి జరుగుతుండగా మాజీ ప్రియుడి ఎంట్రీ.. మండపం పైకి ఎక్కి ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ప్రేమలో పడడం, మనస్పార్థాల కారణంగా విడిపోవడం కామన్ అయిపోయింది. ఆ తర్వాత కుటుంబీకులు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకొని ఎవరి జీవితం వారు చూసుకుంటున్నారు. అయితే, తాజాగా మాజీ ప్రేయసి వివాహం జరుగుతుండగా ఓ యువకుడు కల్యాణ మండపంలోకి వచ్చి తాళి కట్టే సమయంలో పెళ్లి చెడగొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గాజిపుర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఒకే జిల్లాకు చెందిన ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పలు కారణాల వల్ల బ్రేకప్ అయిపోయింది.

అనంతరం వేరే అబ్బాయితో ఆమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల(మే)17వ తేదీన అంగరంగ వైభవంగా వివాహం కార్యక్రమాలు చేపట్టారు. అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక వరుడు అమ్మాయి మెడలో తాళి కట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో మాజీ ప్రియుడు అక్కడికి వచ్చి, మండపంపైకి ఎక్కి వధువు నుదుట సింధూరం పెట్టాడు. దీంతో పెళ్లికి వచ్చినవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదంతా చూసిన వరుడు వివాహం వద్దని మండపం నుంచి వెళ్లిపోయాడు. తర్వాత నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో గ్రామస్థులంతా అతడ్ని పట్టుకుని చితకబాదారు. అనంతరం ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు.

Read more :

హనీమూన్‌లో అసభ్యకరంగా ప్రవర్తించిన భర్త.. ఆపై నగ్న వీడియోలతో అత్తమామలను బ్లాక్ మెయిల్

Next Story

Most Viewed