ప్రతి కన్నడిగుడి కల నా సొంతం: ప్రధాని మోడీ

by Disha Web Desk 12 |
ప్రతి కన్నడిగుడి కల నా సొంతం: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఎన్నికలకు కొద్ది గంటల ముందు ప్రధాని మోడీ కర్ణాటక ప్రజలకు వీడియో ద్వారా కీలక సందేశాన్ని పంపారు. "ప్రతి కన్నడిగుడి కల నా స్వంత కల. మీ తీర్మానమే నా తీర్మానం" అని అన్నారు. కర్నాటకను నంబర్‌వన్‌గా మార్చేందుకు బాధ్యతగల పౌరులుగా ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. బీజేపీ ప్రభుత్వం అత్యంత విధేయతతో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. దీంతో పొలీంగ్ కు కొన్ని గంటల ముందు ప్రధాని వీడియో ద్వారా సందేశాన్ని పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. అలాగే ఈ నెల 13 ఓట్ల లెక్కింపు జరగనుంది.

Next Story

Most Viewed