- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం.. ఎస్బీఐ పిటిషన్పై 11న విచారణ
by Dishanational4 |
X
దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్ల జారీ ద్వారా రాజకీయ పార్టీలు సేకరించిన విరాళాల వివరాలను వెల్లడించేందుకు జూన్ 30 వరకు గడువును పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం(మార్చి 11న) విచారించనుంది. గత నెలలో ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన సందర్భంగా.. మార్చి 6లోగా రాజకీయ పార్టీల విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఆ తేదీలోగా సమాచారాన్ని ఈసీకి ఇవ్వలేమని ఎస్బీఐ వెల్లడించింది. ఈవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ద్వారా కోర్టు ధిక్కారానికి ఎస్బీఐ పాల్పడిందంటూ ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అండ్ కామన్ కాజ్’ సంస్థ మరో పిటిషన్ వేసింది. దీన్ని కూడా మార్చి 11నే సుప్రీంకోర్టు విచారించనుంది.
Next Story