Karnataka swearing-in today :మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆ 8 మంది వీళ్లే

by Dishafeatures2 |
Karnataka swearing-in today :మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆ 8 మంది వీళ్లే
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత సిద్ధరామయ్య ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ తెలిపింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డాక్టర్ జి.పరమేశ్వర, కెహెచ్ మునియప్ప, కెజె జార్జ్, ఎంబి పాటిల్, సతీష్ జార్కిహోళి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొననున్నారు. అదేవిధంగా విపక్షాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.



Next Story

Most Viewed