తమిళనాడు ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం: హోం సెక్రటరీ ధీరజ్ కుమార్ తొలగింపు!

by Gantepaka Srikanth |

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ వేగవంతమవుతున్న తరుణంలో భారత ఎన్నికల సంఘం (ECI) కీలక అడుగు వేసింది.

తమిళనాడు ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం: హోం సెక్రటరీ ధీరజ్ కుమార్ తొలగింపు!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ వేగవంతమవుతున్న తరుణంలో భారత ఎన్నికల సంఘం (ECI) కీలక అడుగు వేసింది. రాష్ట్ర హోం సెక్రటరీగా ఉన్న ధీరజ్ కుమార్ను ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని కాపాడే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోం సెక్రటరీ ధీరజ్ కుమార్‌ను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించిన ఈసీ, ఆయనను ఇతర విధులకు కేటాయించాలని ఆదేశించింది. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల నిర్వహణలో హోం శాఖ పాత్ర అత్యంత కీలకం కావడంతో ఈ బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది. ధీరజ్ కుమార్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి మణివాసన్ను కొత్త హోం సెక్రటరీగా ఈసీ నియమించింది. మణివాసన్ తక్షణమే బాధ్యతలు చేపట్టాలని, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆయనే ఈ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది. సాధారణంగా ఎన్నికల సమయంలో అధికారుల పనితీరుపై ఫిర్యాదులు వచ్చినా లేదా ఎన్నికల నిర్వహణలో మరింత పారదర్శకత అవసరమని భావించినా ఈసీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. తమిళనాడులో ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ ఈ మార్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story