ECI: ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కీలక నిర్ణయం.. వినూత్న క్యాంపెయిన్‌కు శ్రీకారం

by Disha Web Desk 1 |
ECI: ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కీలక నిర్ణయం.. వినూత్న క్యాంపెయిన్‌కు శ్రీకారం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఇప్పటికే లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా పలు పార్టీల అధినేతలు తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను సైతం ప్రకటించారు. ఈ మేరకు వారంతా గడపగడపుకు తిరుగుతూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపత్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పలు కీలక చర్యలు తీసుకుంది. ఇప్పటికే పెట్రోలియం సంస్థలు, రైల్వే శాఖతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా ముఖ్యంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం సోషల్‌ మీడియాలో విభిన్నంగా ప్రచారం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి యువ, పట్టణ ఓటర్లను ప్రోత్సహించేందుకు ‘ఆప్‌ ఏక్‌ హై’ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది.



Next Story