కర్ణాటక ఎన్నికల పోలింగ్ శాతం విడుదల చేసిన ఈసీ

by Disha Web Desk 2 |
కర్ణాటక ఎన్నికల పోలింగ్ శాతం విడుదల చేసిన ఈసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.03 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు పోలింగ్ శాతం డేటాను విడుదల చేశారు. 224 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అధ్యక్షులతో పాటు పలువురు నాయకులు, సినీ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఎన్నికల్లో కర్ణాటక వ్యాప్తంగా 2615 మంది అభ్యర్థులు బరిలోదిగారు. 58,545 పోలింగ్ బూతుల్లో పోలింగ్ జరుగుతోంది. 5.3 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాదాపు 4 లక్షల మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎన్నికల పోలింగ్ సిబ్బందితో పాటు పోలీసులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

భారతీయుడిగా ఓటు వేశా: నటుడు కిచ్చా సుదీప్

Next Story

Most Viewed