భారత్-చైనా సరిహద్దు సమీపంలో భూకంపం

by Disha Web Desk 12 |
భారత్-చైనా సరిహద్దు సమీపంలో భూకంపం
X

దిశ, వెబ్‌డెస్క్: భారతలోని కేంద్రపాలిత ప్రాంతం అయిన లడఖ్ లో మంగళవారం భూకంపం సంభవించింది. భారత్-చైనా సరిహద్దు సమీప కేంద్రంగా.. 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉదయం 10.47 గంటలకు భూమి కంపించింది. ఇప్పటివరకు, ఎటువంటి నష్టం జరగలేదు. కాగా ఈ భూకంప కేంద్రం లేహ్ పట్టణానికి ఉత్తరాన 166 కిలోమీటర్ల దూరంలో ఉండగా, లోతు 105 కిలోమీటర్లుగా ఉంది ఉన్నట్లు ఎన్‌సిఎస్ తెలిపింది.



Next Story

Most Viewed