అండమాన్ దీవుల్లో భూకంపం.. రెడ్ అలర్ట్స్ జారీ

by Muthe.Rajitha |

జపాన్ తీరంలో ఆదివారం అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించిన కొద్ది గంటల్లోనే అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో కూడా భూకంపం సంభవించింది.

అండమాన్ దీవుల్లో భూకంపం.. రెడ్ అలర్ట్స్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్ : జపాన్ తీరంలో ఆదివారం అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించిన కొద్ది గంటల్లోనే అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో, 10 కి.మీల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ పేర్కొంది. పోర్టు బ్లెయిర్‌కు ఈశాన్యంగా 147 కి.మీ దూరంలో భూకంపం సంభవించిందని తెలిపింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొనగా.. జపాన్ లో సునామీ హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో అండమాన్ లో కూడా రెడ్ అలర్ట్స్ జారీ చేసినట్టు సమాచారం.

Next Story