ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించం.. ఈజిప్ట్ విదేశాంగ మంత్రితో జైశంకర్‌

by Phanindra |

భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఈజిప్ట్ విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. భారత్, పాక్ పరిస్థితులపై ఆరాతీశారు.

ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించం.. ఈజిప్ట్ విదేశాంగ మంత్రితో జైశంకర్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బాదర్ అహ్మద్ మహమద్ అబ్దెలాటీ సంభాషించారు. జైశంకర్‌కు కాల్ చేసిన ఆయన.. ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ‘ఈజిప్ట్ విదేశాంగ మంత్రికి ప్రస్తుత పరిస్థితులను వివరించడం జరిగింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దాన్ని తాము సహించబోమని ఆయనకు స్పష్టంచేశాం. అలాగే భారత్, ఈజిప్ట్ మధ్య ఆర్థిక సహకారం అంశాలపై కూడా చర్చించాం. త్వరలోనే ఆయన భారత్‌కు వచ్చే అవకాశం ఉంది’ అని జైశంకర్ తెలిపారు.

Next Story