- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విదేశీ నౌకపై డ్రోన్ దాడి: రక్షించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం
by Dishanational2 |
X
దిశ, నేషనల్ బ్యూరో: గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో మార్షల్ ఐలాండ్కు చెందిన ఎంవీ జెన్కో పికార్డీ అనే వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న భారత నౌకాదళానికి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నంకు ఫోన్ కాల్ రావడంతో వెంటనే రంగంలోకి దిగి బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు నౌకను అడ్డగించి సహాయం అందించింది. ఎంవీ జెన్కో షిప్లో 9 మంది భారత నావికులు సహా 22 మంది సిబ్బంది ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇండియన్ నేవీ తెలిపింది. నౌకను అడ్డగించిన తర్వాత షిప్లో దెబ్బతిన్న ప్రాంతాన్ని నిపుణులు ఓడలోకి వెళ్లి పరిశీలించారు. తదుపరి రవాణాకు ఆ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఎర్ర సముద్రంలో వ్యాపార నౌకలపై హౌతీ మిలిటెంట్లు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
Next Story