భారత్‌కు ట్రంప్ బెదిరింపులు.. 24 గంటల్లో ఆ పనిచేయబోతున్నానంటూ ప్రకటన

by Gantepaka Srikanth |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) మరోసారి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో వ్యాపారం చేయడం చాలా కష్టంగా మారుతోందని అన్నారు.

భారత్‌కు ట్రంప్ బెదిరింపులు.. 24 గంటల్లో ఆ పనిచేయబోతున్నానంటూ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) మరోసారి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో వ్యాపారం చేయడం చాలా కష్టంగా మారుతోందని అన్నారు. 24 గంటల్లో భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఇటీవలే భారత్‌(India)పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌.. తాజాగా మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్‌ భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును మళ్లీ విక్రయిస్తోందన్నారు. బహిరంగ మార్కెట్‌లో చమురు విక్రయించి భారత్‌ లాభం గడిస్తోందంటూ ఆక్షేపించారు. భారత్‌ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేకూరుతున్నాయని, అందుకే ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడం లేదని విమర్శించారు.

Next Story