'ఆమె చెప్పే ప్రతి మాటకు సమాధానం చెప్పాలా?': కంగనా విమర్శలపై ప్రియాంక గాంధీ స్ట్రాంగ్ కౌంటర్

by Dishanational1 |
ఆమె చెప్పే ప్రతి మాటకు సమాధానం చెప్పాలా?: కంగనా విమర్శలపై ప్రియాంక గాంధీ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ మండీ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కంగనా రనౌత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ గట్టిగా బదులిచ్చారు. కంగనా విమర్శలపై స్పందించాల్సిన అవసరంలేదని బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అంతేకాకుండా కంగనా రనౌత్ ప్రకటనలను 'నాన్సెన్స్'గా కొట్టిపారేసిన ప్రియాంకా గాంధీ, ఆమె మాట్లాడే ప్రతి మాటకు బదులివ్వాలా? అంటూ ప్రశ్నించారు. 'ఆమె నా గురించి మాట్లాడినందుకు సంతోషం. కానీ ఆమె చెప్పే ప్రతి పనికిరాని మాటకు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నారా?' అన్నారు. అలాగే, తరచూ కంగనా రనౌత్ కాంగ్రెస్ పార్టీని, గత కాంగ్రెస్ పాలనను విమర్శించడంపై అడిగినప్పుడు, అందుకు ప్రియాంకా గాంధీ నిరాకరించారు. ఇతర ముఖ్యమైన సమస్యలపై మాట్లాడాలని అన్నారు. అలాగే, సనాతన ధర్మంపై కాంగ్రెస్ ఎలాంటి దాడులు చేయలేదంటూ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. తామెప్పుడూ అధికారాన్ని పూజించమని, దైవశక్తిని ఆరాధిస్తామని అన్నారు. రాముడి మార్గానికి సమానమైన సత్య మార్గాన్ని బీజేపీ ప్రభుత్వం అనుసరించడంలేదని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. కాగా, ఆదివారం ఎన్నికల ర్యాలీలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ మనస్తత్వం నన్ను, హేమా మాలిని, జయప్రద, ఇతర మహిళలను అవమానించడమేనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed