- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Black Out:బ్లాక్ అవుట్.. యుద్ధ సమయంలో ఎందుకు అమలు చేస్తారో తెలుసా?

దిశ,వెబ్డెస్క్: ప్రస్తుతం భారత్–పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు ముందస్తు రక్షణగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో ప్రజల భద్రత దృష్ట్యా బ్లాక్ అవుట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి సమయంలో ఇతర దేశం చేసే దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకోవడానికి బ్లాక్ అవుట్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం భారత్–పాక్ యుద్ధ సమయంలో బ్లాక్ అవుట్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
బ్లాక్ అవుట్ అంటే..
యుద్ధం లేదా అత్యవసర పరిస్థితుల్లో లైట్లు, ఇతర విద్యుత్ ఉపకరణాలను ఆపేయడాన్ని బ్లాక్ అవుట్ అంటారు. యుద్ధ సమయంలో శత్రువులు నగరాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటారు. రాత్రి సమయంలో లైట్ల వెలుగు వారికి లక్ష్యాలను గుర్తించడంలో దోహదపడుతుంది. అందుకే బ్లాక్ అవుట్ అమలు చేస్తారు. లైట్లు అర్పితే శత్రువుల విమానాలు, క్షిపణులు మన స్థానాలను గుర్తించలేవు. ఫలితంగా దాడుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇది అమలు చేయడం ద్వారా నగరాలను చీకటిలో ఉండడం వల్ల శత్రువులకు దాడి చేయడం కష్టంగా ఉంటుంది. ఇది పౌరులు, సైనిక స్థావరాల భద్రతను కాపాడుతుంది.
ఎలా అమలు చేస్తారు..
బ్లాక్ అవుట్ ప్రకటించే ముందు సైరన్లు మోగిస్తారు. ఈ సైరన్ల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ క్రమంలో సైరన్ వినగానే ప్రజలు తమ ఇళ్లలోని లైట్లు, టీవీలు, ఇతర విద్యుత్ ఉపకరణాలను వెంటనే ఆపివేయాలి. దీంతో అంత చీకటిమయం అవుతుంది. భారత్లో 53 ఏళ్లతర్వాత నిన్న(మే 7) సరిహద్దు నగరాల్లో బ్లాక్ అవుట్ విధించారు.