- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలను మోసం చేయడమే DMK పని.. పుదుచ్చేరికి సభలో విజయ్ సంచలన వ్యాఖ్యలు
టీవీకే పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ పుదుచ్చేరిలోని ఉప్పలం ఎక్స్పో గ్రౌండ్లో జరిగిన భారీ బహిరంగ సభలో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టీవీకే పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ పుదుచ్చేరిలోని ఉప్పలం ఎక్స్పో గ్రౌండ్లో జరిగిన భారీ బహిరంగ సభలో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. DMK యొక్క పని కేవలం ప్రజలను 'మోసం చేయడమే అని ఆయన ఆరోపించారు. "పుదుచ్చేరి ప్రజలు DMKను నమ్మవద్దు," అని విజయ్ అభ్యర్థిస్తూ, "తమిళనాడులో కొందరు తిరస్కరించినట్లు పుదుచ్చేరి ప్రజలు మమ్మల్ని తిరస్కరించ వద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడును ప్రత్యేక రాష్ట్రంగా, పుదుచ్చేరిని కేంద్ర పాలిత ప్రాంతంగా వర్గీకరించినా, తన ఉద్యమానికి మాత్రం ఈ రెండూ విడదీయరానివని, స్ఫూర్తిలో తామంతా ఒక్కటేనని ఆయన ఉద్ఘాటించారు.
అయితే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలనే సుదీర్ఘ డిమాండ్ను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఇక్కడ ఐటీ కంపెనీలను తీసుకురావడానికి సరైన ప్రణాళిక లేదని విజయ్ విమర్శించారు. మరోవైపు, తమ పార్టీ కార్యక్రమమైనప్పటికీ భద్రత, శాంతిభద్రతలను పటిష్టంగా నిర్వహించినందుకు ప్రస్తుత పుదుచ్చేరి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విజయ్ ప్రశంసించారు. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం పుదుచ్చేరి నుంచి నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. కారైకాల్, యానాం వంటి ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని, అలాగే పర్యాటక కేంద్రంగా ఉన్నప్పటికీ సరైన పార్కింగ్ సదుపాయాలు లేవని ఆయన లోటుపాట్లను ఎత్తి చూపారు.
మత్స్యకారుల సమస్యలను ప్రస్తావిస్తూ... పుదుచ్చేరి మత్స్యకారులు తరచుగా శ్రీలంక నౌకాదళం చేత వేధింపులకు, అరెస్టులకు గురవుతున్నారని, వారి పడవలు స్వాధీనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయంగానూ 1974లోనే పుదుచ్చేరి, తమిళనాడు కంటే ముందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తూ, రాబోయే ఎన్నికల్లో పుదుచ్చేరిపై టీవీకే జెండా తప్పకుండా ఎగురుతుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు.
- Tags
- TVK Vijay






