ధర్మస్థలం కేసులో సంచలన పరిణామం.. శవాలను పూడ్చిపెట్టిన శానిటరీ వర్కర్ ఫేస్ రివీల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-23 07:45:32  IST  )

ధర్మస్థలి కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. శానిటరీ వర్కర్ చెప్పినట్లుగా అక్కడ ఎలాంటి నేరాలు జరగలేదని తేలిపోయింది. అయిన చెప్పినట్లుగా తవ్వకాలు జరిపినా.. శవాల జాడ దొరకకపోవడంతో తప్పుదోవ పట్టించినట్లు నిర్ధారణకు వచ్చారు సిట్ అధికారులు

ధర్మస్థలం కేసులో సంచలన పరిణామం.. శవాలను పూడ్చిపెట్టిన శానిటరీ వర్కర్ ఫేస్ రివీల్
X

దిశ, వెబ్ డెస్క్ : ధర్మస్థలి కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. శానిటరీ వర్కర్ చెప్పినట్లుగా అక్కడ ఎలాంటి నేరాలు జరగలేదని తేలిపోయింది. అయిన చెప్పినట్లుగా తవ్వకాలు జరిపినా.. శవాల జాడ దొరకకపోవడంతో తప్పుదోవ పట్టించినట్లు నిర్ధారణకు వచ్చారు సిట్ అధికారులు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 1995 నుంచి 2004 మధ్యలో అమ్మాయిలపై హత్యాచారాలు జరిగాయని, వారిని తన చేతులమీదుగా పాతిపెట్టానని చెప్పాడు శానిటరీ వర్కర్. కానీ ఇదంతా జరగకపోవడంతో సిట్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లు అతనికి హాని కలగకుండా మాస్క్ కూడా కవర్ చేసి.. విచారణ చేశారు. కాగా తాజాగా నేషనల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఫొటో రివీల్ అయింది. మాస్క్ మనిషి ఇతనేనని కన్ఫర్మ్ చేయడంతో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Next Story