ఢిల్లీ లిక్కర్ కేసు: మరోసారి సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

by Disha Web Desk 2 |
ఢిల్లీ లిక్కర్ కేసు: మరోసారి సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. వివిధ కారణాలతో మూడు సార్లు విచారణకు హాజరుకాని కేజ్రీవాల్.. మూడోసారైనా హాజరు అవుతారో లేదో అనే విషయం ఆసక్తిగా మారింది. మరోవైపు తనకు నోటీసులు జారీచేసిన తొలిసారే కేజ్రీవాల్ సమన్లపై స్పందించారు. తనకు సమన్లు జారీ చేయడం చట్టవిరుద్ధమని ఐదు పేజీల సమాధానాన్ని సీఎం ఈడీకి పంపించారు. లోక్‌సభ ఎన్నికల హడావుడి ప్రారంభం అయిన వేళ మరోసారి సీఎంకు నోటీసులు జారీ చేయడం దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

Next Story