ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఎక్కడికి వెళ్లాడో తెలుసా?

by Disha Web Desk 2 |
ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఎక్కడికి వెళ్లాడో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఇవాళ విచారణకు హాజరుకావాలని ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు ఈడీ సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. ఈడీ స‌మ‌న్లను బేఖాత‌రు చేస్తూ ఢిల్లీ సీఎం ప‌ది రోజుల విపాస‌న మెడిటేష‌న్ క్యాంప్‌, పంజాబ్‌కు వెళ్లారు. ఇక ఈడీ త‌న‌కు పంపిన స‌మ‌న్లు అక్రమ‌మ‌ని, రాజ‌కీయ దురుద్దేశంతో కూడిన‌వ‌ని కేజ్రీవాల్ సమన్లపై స్పందించారు. ‘ఈ సమన్లు స్వీకరించడానికి నేను సిద్ధం. కానీ, గతంలో ఇచ్చిన వాటివలే ఈ సమన్లు కూడా చట్టవిరుద్ధమే. ఇవి రాజకీయంగా ప్రేరేపితమైనవి. వీటిని ఉపసంహరించుకోవాలి. నేను నిజాయతీతో పారదర్శకంగా జీవిస్తున్నాను. నా జీవితంలో దాచడానికి ఏమీ లేదు’ అని కేజ్రీవాల్ స్పందిచారు.


Next Story