Rajnath Singh: భారత్‌కే కాదు.. మొత్తం ప్రపంచానికే ఇది ఆందోళనకరమైన విషయం

by Gantepaka Srikanth |

పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న అస్థిరత కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదని, ఇది మొత్తం ప్రపంచానికే ఆందోళన కలిగించే అంశమని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

Rajnath Singh: భారత్‌కే కాదు.. మొత్తం ప్రపంచానికే ఇది ఆందోళనకరమైన విషయం
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న అస్థిరత కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదని, ఇది మొత్తం ప్రపంచానికే ఆందోళన కలిగించే అంశమని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ సంక్షోభం వల్ల తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంటూనే, శాంతి స్థాపన కోసం దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచం ఒక క్లిష్టమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ శాంతికి విఘాతం కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. "యుద్ధం దేనికీ పరిష్కారం కాదు.. చర్చలు, దౌత్యంతోనే సమస్యలను పరిష్కరించుకోవాలి" అని ప్రధాని మోడీ గతంలో చెప్పిన మాటలను రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అన్ని దేశాలు దౌత్యపరమైన చొరవ చూపాలని కోరారు.

ఇంధన, ఎరువుల భద్రత..

యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన (Crude Oil) మరియు ఎరువుల (Fertilizers) ధరలు పెరిగే ప్రమాదం ఉందని, ఈ సంక్షోభం భారత్‌పై పడకుండా ప్రధాని మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు అవసరమైన అన్ని రకాల దౌత్య ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని రక్షణ మంత్రి పునరుద్ఘాటించారు.

Next Story