మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తీవ్ర విషాదం.. స్నేహితులను ప్రాంక్ చేయబోయి పరలోకానికి

by Disha Web Desk 1 |
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తీవ్ర విషాదం.. స్నేహితులను ప్రాంక్ చేయబోయి పరలోకానికి
X

దిశ, వెబ్‌డెస్క్: మొబైల్ ఫోన్లు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ప్రాంక్ వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంక్ వీడియోలే ఓ విద్యార్థిని పరలోకానికి పంపిన ఘటన మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 1న అభిషేక్ అనే విద్యార్థి తన స్నేహితులను ప్రాంక్ చేద్దామని ప్లాన్ వేశాడు. అనుకుందే తడవుగా ఉరేసుకుంటున్నట్లు డ్రామా ఆడాలని బిల్డప్ ఇద్దామని ఫిక్స్ అయ్యాడు. అనంతరం తాడును ఫ్యాన్‌కు కట్టి మెడకు ఉరేసుకుని ఫ్రెండ్స్‌కు వీడియో కాల్ చేశాడు.

ఈ క్రమంలోనే సీన్ ఒక్కసారిగా రివర్స్ అయ్యింది. ఫ్రెండ్స్‌తో వీడియో కాల్‌ మాట్లాడుతుండగానే కాళ్ల కింద ఉన్న స్టూల్ ఒక్కసారిగా పడిపోయి అభిషేక్‌ మెడుకు ఉరి బిగుసుకుంది. వీడియో కాల్‌‌లో ఉండగానే అతడి ప్రాణం పోయింది. దీంతో గమనించిన స్నేహితులు విషయం తల్లిదండ్రులకు తెలుపగా.. అభిషేక్‌ను వారు సమీప ఆసుపత్రి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే అతడు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. కళ్ల ముందే స్నేహితుడు ప్రాణాలు కోల్పోవడంతో తోటి స్నేహితులు కన్నీరుమున్నీరు అయ్యారు. కాగా మృతుడి అభిషేక్‌ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లుగా తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed