Lalith Modi : దావూద్ బెదిరింపుల వల్లే పారిపోయా : లలిత్ మోడీ

by Muthe.Rajitha |   (  Updated:2024-11-25 15:43:23  IST  )

ఐపీఎల్(IPL) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ(Lalith Modi) తన గురించి కొన్ని సంచలన నిజాలు బయట పెట్టారు.

Lalith Modi : దావూద్ బెదిరింపుల వల్లే పారిపోయా : లలిత్ మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్(IPL) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ(Lalith Modi) తన గురించి కొన్ని సంచలన నిజాలు బయట పెట్టారు. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న లలిత్ మోడీ.. తాను దేశం విడిచి పారిపోవడానికి లీగల్ ఇష్యూస్ కారణం కాదని, దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim) బెదిరింపులే కారణమని వెల్లడించారు. దావూద్ ఐపీఎల్లో అన్ని మ్యాచ్ లు ఫిక్సింగ్ పాల్పడాలని చూశారని, అతని నుంచి నాకు అనేక బెదిరింపులు వచ్చాయని అందుకే నేను దేశం విడిచి వెళ్లిపోయానని తెలిపారు. తనపై ఒక్క కేసు కూడా లేదని.. త్వరలోనే తాను భారత్ వస్తానని ప్రకటించారు. కాగా 2010లో భారత్ నుంచి పారిపోయిన లలిత్.. ప్రస్తుతం యూకేలో ఉంటున్నాడు.

Next Story