కరెంట్ అధికారులపై దాడి.. కట్టెలతో ఉరికిచ్చి కొట్టి.. తర్వాత..(VIDEO)

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-09 15:09:10  IST  )

ఒడిశాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ముకుందదాస్‌పూర్‌లో మహ్మద్ షమ్సుద్దీన్ అనే వ్యక్తి టాటా పవర్ ఉద్యోగులపై దాడికి దిగాడు. దొంగతనంగా కరెంట్ వాడటం, చాలా నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంపై ప్రశ్నించగా.. కట్టెతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు

కరెంట్ అధికారులపై దాడి.. కట్టెలతో ఉరికిచ్చి కొట్టి.. తర్వాత..(VIDEO)
X

దిశ, వెబ్ డెస్క్: ఒడిశాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ముకుందదాస్‌పూర్‌లో మహ్మద్ షమ్సుద్దీన్ అనే వ్యక్తి టాటా పవర్ ఉద్యోగులపై దాడికి దిగాడు. దొంగతనంగా కరెంట్ వాడటం, చాలా నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంపై ప్రశ్నించగా.. కట్టెతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. తర్వాత అసలు తన తప్పే లేదనట్లుగా వాదనకు దిగాడు. ఈ సంఘటన ఖోర్ధా జిల్లాలోని బాలిపట్నా పోలీస్ పరిధిలో జరగ్గా.. పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించారు. కాగా షమ్సుద్దీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ప్రవర్తనను అస్సలు క్షమించకూడదని.. కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

VIDEO

Next Story