- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ MCD ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని 12 వార్డుల ఖాళీ కావడంతో.. ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

దిశ, వెబ్డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Delhi Municipal Corporation) లోని 12 వార్డుల ఖాళీ కావడంతో.. ఉప ఎన్నికలు (By-elections) అనివార్యం అయ్యాయి. కాగా నవంబర్ 30న ఈ 12 వార్డులకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Counting of votes) ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ 12 స్థానాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఎన్నికల ద్వారా ఢిల్లీ పౌర సంస్థలో తమ బలాన్ని పెంచుకోవాలని ప్రధాన పార్టీలు చూస్తున్నాయి. ఈ 12 స్థానాల్లో తొమ్మిది స్థానాలు గతంలో బీజేపీ ఆధీనంలో, మూడు స్థానాలు AAP ఆధీనంలో ఉన్నాయి.
ఈ ఉప ఎన్నికల్లో 38.51% ఓటింగ్ నమోదైంది, ఇది 2022 లో జరిగిన సాధారణ MCD ఎన్నికల (50.47%) కంటే తక్కువ. ప్రస్తుతం MCD లో 115 స్థానాలతో ఉన్న బీజేపీ, ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మెజారిటీ మార్కు అయిన 126ను దాటి కార్పొరేషన్పై పూర్తి పట్టు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 99 స్థానాలు ఉన్న AAP, ఈ కోల్పోయిన స్థానాలను తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడే అవకాశం ఉంది. షాలిమార్ బాగ్-బి (Shalimar Bagh-B), ద్వారకా-బి వంటి ముఖ్యమైన వార్డుల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






