బిగ్ బ్రేకింగ్.. దేశంలో 24 గంటల్లో 10 వేలు దాటిన కరోనా కేసులు..

by Disha Web Desk 12 |
బిగ్ బ్రేకింగ్.. దేశంలో 24 గంటల్లో 10 వేలు దాటిన కరోనా కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అంతరించిపోయింది అనుకున్న కరోనా మరోసారి పంజా విసురుతుంది. చాపకింద నీరులా.. సమాజంలో విస్తరించిన కరోనా కేసులు రోజు రోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుదల చూస్తున్నాయి. గత వారం రోజులుగా 6 వేలకు పైగా కేసులు నమోదవుతు వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 10,158 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 44,000 దాటింది. దీంతో దేశంలో కరోనా నుంచి మరో ముంపు తప్పేట్లు లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో ఉపశమనం కలిగించే విషయం ఎంటటే ఈ కొత్త వేరియంట్‌తో అంతగా ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ప్రజలు తమ జాగ్రత్తగా ఉండటం మంచిది అంటున్నారు.



Next Story

Most Viewed