వివాదాలు మా స్వభావంలో భాగం కాదు: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

by Malleboina Mahesh |

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు ఎవరితోనూ వివాదాలు లేవని, వివాదాలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. "వివాదాలు మా స్వభావంలో భాగం కాదు.

వివాదాలు మా స్వభావంలో భాగం కాదు: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు ఎవరితోనూ వివాదాలు లేవని, వివాదాలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. "వివాదాలు మా స్వభావంలో భాగం కాదు. అందరితో కలిసి ముందుకు సాగడం మా స్వభావం,సంస్కృతి" అని ఆయన తెలిపారు. ఈ సంస్కృతి అనేక విదేశీ దేశాల మాదిరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయ 'రాష్ట్ర' (Rashtra) భావన ఇతర దేశాల 'నేషనల్' (Nation) భావన కంటే చాలా భిన్నమైనదని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

అలాగే భారతదేశంలో జాతీయవాదం (Nationalism) ఒక సమస్యే కాదని మోహన్ భాగవత్ అన్నారు. "మన 'రాష్ట్రం' ఎల్లప్పుడూ ఇక్కడే ఉంది. మనం జాతీయత (Nationality) అనే భావనను విశ్వసిస్తాము, జాతీయవాదాన్ని కాదు. మనం 'నేషన్హుడ్' (Nationhood) అనే భావనను కూడా విశ్వసిస్తాము" అని ఆయన వివరించారు. ఈ ప్రకటన ద్వారా, ఆర్‌ఎస్‌ఎస్ జాతీయత, రాష్ట్ర భావనను కేవలం రాజకీయ- భౌగోళిక అంశంగా కాకుండా, లోతైన సాంస్కృతిక , సహజీవన సిద్ధాంతంగా చూస్తుందని భాగవత్ స్పష్టం చేశారు.

మోహన్ భాగవత్ తన ప్రసంగాన్ని ముగిస్తూ, "అహంకారాలు కరిగిపోయిన తర్వాతే మన 'దేశం' ఉనికిలోకి వచ్చింది" అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు, భారతీయ భావం అనేది ఎవరిపైనా ఆధిపత్యాన్ని చూపడం ద్వారా కాకుండా, సమష్టి స్ఫూర్తితో, వ్యక్తుల వ్యక్తిగత అహంకారాలను అధిగమించడం ద్వారా ఏర్పడిందని సూచిస్తున్నాయి. దేశం కలిసికట్టుగా, సామరస్యంగా అభివృద్ధి చెందడానికి గల తాత్విక పునాదిని ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ Mohan Bhagwat వివచించారు.

Next Story