పార్లమెంటుకు నల్ల దుస్తుల్లో కాంగ్రెస్ ఎంపీలు!

by Disha Web Desk 12 |
పార్లమెంటుకు నల్ల దుస్తుల్లో కాంగ్రెస్ ఎంపీలు!
X

న్యూఢిల్లీ: రాహుల్ ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ ఎంపీలు వినూత్నంగా నిరసన చేపట్టనున్నారు. సోమవారం పార్లమెంటుకు నల్ల వస్త్రాలు ధరించి రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్‌పై చర్యలను నిరసిస్తూ రాజ్యసభ, లోక్‌సభ‌కు ఈ వేషాధారణలో వెళ్లనున్నట్లు పేర్కొన్నాయి. గత ఏడాది కేంద్రం ఇంధన ధరలు, నిత్యావసరాలు, జీఎస్టీ పెంపుతో పాటు నిరుద్యోగాన్ని నిరసిస్తూ రాహుల్ గాంధీతో సహా పలువురు ఎంపీలు నలుపు దుస్తులు ధరించి రాష్ట్రపతి భవన్ వైపు మార్చి చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, పార్లమెంట్‌లో గత కొన్ని రోజులుగా అదానీ అంశంపై జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి రాహుల్‌పై వేటు కూడా తోడు కానుంది.

Next Story